telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మరోసారి కేరళ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

kerala floods

కేరళ రాష్ట్రంపై ప్రకృతి మరోసారి కన్నెర్రజేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంబించిపోయింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరువనంతపురం, విజింజమ్, కొల్లం నందకర జిల్లాల్లో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు.

మరోవైపు కోజికోడ్, వయనాడ్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మణప్పురం, కన్నూర్, ఇడుక్కి జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల కారణంగా వరదనీరు భారీగా వస్తుండటంతో పంబ, కల్లార్ కుట్టి, భూతన్ కెట్టు, మలంకర డ్యామ్ ల గేట్లను తెరిచారు. తీర ప్రాంతాల్లో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Related posts