telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పీవీ సింధూకు కేరళ రూ.10లక్షల నగదు

pv sindhu player

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను భారత షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధూ ను ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమెను అభినందించిన సంగతి తెలిసిందే. తాజాగా పీవీ సింధూకు కేరళ సర్కారు పదిలక్షల రూపాయల నగదు అవార్డును ప్రదానం చేసింది.

కేరళ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. సునీల్ కుమార్ పీవీ సింధూకు పదిలక్షల రూపాయల చెక్కును ప్రదానం చేశారు.ప్రపంచ బంగారు పతకం సాధించిన సింధూను కేరళ ఒలింపిక్స్ సంఘం క్రీడాకారులు అభినందించారు. కర్ణాటక రాష్ట్రం మైసూరులో నిర్వహించిన దసరా నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న పీవీ సింధూ కేరళ రాష్ట్రంలోనూ పర్యటించారు.

Related posts