దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. తలసెరి-కార్గ్ హైవే-30ని కర్ణాటక పోలీసులు బంద్ చేయడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా పినరయి లేఖలో పేరొన్నారు. ఈ రోడ్డు మార్గం కేరళను కర్ణాటకలోని కార్గ్ ప్రాంతంతో వయా వీర్రాజ్పేట్ మీదుగా కలుపుతుంది. కేరళకు నిత్యావసర సరుకులు ఈ మార్గం గుండానే వస్తుంటాయి.
కార్గ్ హైవే మార్గం బంద్ చేస్తే వాహనాలు కేరళకు చేరుకునేందుకు చుట్టూ తిరుగుతూ చాలా దూరం ప్రయాణించాల్సింది ఉంటుంది. లాక్డౌన్ నేపథ్యంలో ఈ మార్గం బంద్ చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కష్ట సమయంలో రాష్ర్టానికి నిత్యావసర సరుకుల రవాణా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు సీఎం పినరయి లేఖలో పేర్కొన్నారు.