పౌరసత్వ సవరణచట్టం (సీఏఏ ) అనేది మత సంఘర్షణలకు దారి తీసే దుశ్చర్య అని కేరళ సీఎం పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇందులో భాగంగా తమ వ్యతిరేకతను కేంద్రానికి తెలియజేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. భారతదేశం లౌకికవాదానికి ప్రతీకని అన్నారు. అలాంటి, లౌకివతత్వానికి భంగం కలిగిస్తామంటే ఎలా ఊరుకుంటామని ఆయన కేంద్రంపై మండిపడ్డారు.
కేరళలో ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీని అమలుకానివ్వమని చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్రంలో భారీ ఎత్తున మానవహారం నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికే కేరళ అసెంబ్లీ సీఏఏను వ్యతిరేకిస్తున్నట్లు బిల్ పాస్ చేసిన విషయం తెలిసిందే.
లేనిపోనివి కల్పించి నాపై దుష్ప్రచారం: లక్ష్మీ పార్వతి