telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హైదరాబాద్ లాంటి సురక్షితమైన నగరంలో ఇలాంటి ఘటనా…!? : కీర్తి సురేష్

Keerthy

ప్రముఖ నటి కీర్తి సురేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ ట్వీట్ సినిమాల గురించి కాదు… వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యపై కీర్తి సురేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక హత్య హృదయవిదాయకరమని, అత్యాచారం చేసి, దహనం చేయడం బాధించిందన్నారు. రోజురోజుకి పరిస్థితులు భయానకంగా మారుతున్నాయన్నారు. ఈ సమయంలో తన నోట మాట రావడం లేదని, హైదరాబాద్ లాంటి సురక్షితమైన నగరంలో ఎవరిని దీనికి బాధ్యలను చేయాలో తెలియడం లేదన్నారు. ఏ సమయంలోనైనా మహిళలు నిర్భయంగా తిరిగేలా ఈ దేశం ఎప్పుడు మారుతుందని ప్రశ్నించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని పట్టుకుని.. కఠినంగా శిక్షించాలన్నారు. ప్రియాంక కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నిందితులను పట్టుకునేందుకు సహకరించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తాను కర్మను నమ్ముతానని.. 24 గంటలు అది పనిచేస్తుందని కీర్తి ట్వీట్ చేశారు.

Related posts