telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మణిరత్నం సినిమా నుంచి తప్పుకున్న కీర్తి సురేష్…!

Keerthy-Suresh

కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే నాగార్జున “మన్మథుడు-2” చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం కీర్తి సురేష్ మిస్ ఇండియా, పెంగ్విన్ లాంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. “మహానటి”తో జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన కీర్తి సురేష్ తాజాగా రజినీకాంత్ సినిమాలో నటించబోతున్నట్లు ప్రకటించేసింది. అయితే ఆమె నటిస్తున్న సినిమాల జాబితాలో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `పొన్నియ‌న్ సెల్వ‌న్‌` చిత్రం కూడా ఉంది. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమా నుండి కీర్తి సురేశ్ త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం. ఈమె ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణ‌మంటూ ఏదీ లేద‌ని, డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోవ‌డ‌మేన‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. కీర్తిసురేశ్ స్థానంలో త్రిష న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రం దాదాపు 800 కోట్ల బ‌డ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్న‌ట్టు స‌మాచారం. క‌ల్కీ రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే చారిత్ర‌క న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఏఆర్ రెహ‌మాన్ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా… మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, మోహ‌న్ బాబు, ఐశ్వ‌ర్య‌రాయ్, అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి ప‌లువురు స్టార్స్ న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Related posts