తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పూర్ణకుంభంతో కేసీఆర్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో ముక్తేశ్వర స్వామికి కేసీఆర్ అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీబరాజ్ ను సందర్శించారు.
ఏరియల్ వ్యూ ద్వారా లక్ష్మీ బరాజ్ ను కేసీఆర్ వీక్షించారు. నీటి నిర్వహణపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షించారు. అంతకుముందు, పుష్కరఘాట్ లో గోదావరి నదికి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. నదిలో నాణేలు వదలి, నదీమ తల్లికి చీర, సారె కేసీఆర్ సమర్పించారు.
చంద్రబాబు గజదొంగ..కేసీఆర్, కేటీఆర్ మంచివారు: మోహన్బాబు