తెలంగాణలో గత రాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఉదయం కొందరు ఉన్నతాధికారులు సీఎంను కలువగా, సమ్మెను విరమించి, వెంటనే విధుల్లోకి రావాలని మరోసారి పిలుపునివ్వాలని సీఎం సూచించినట్టు సమాచారం.
యూనియన్ నాయకులు సానుకూలంగా స్పందిస్తే కార్మికులకు అనుకూల నిర్ణయాలు తీసుకుందామని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఇదే సమయంలో సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది.
టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు బీజేపీ భావజాలంతోనే పనిచేయాలి: జీవీఎల్