telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉమ్మడి రాష్ట్రంలో విజయ డైరీని శ్మశానంలా చేశారు: సీఎం కేసీ ఆర్

KCR cm telangana

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయ డైరీని శ్మశానంలా చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పాడిపశువులను పెంచుకునే సంస్కారం లేక గత ప్రభుత్వాలు విజయడైరీని నాశనం చేశాయని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, కర్ణాటక డెయిరీల నుంచి పాలు సేకరించేవారని చెప్పుకొచ్చారు. రూ.30 కోట్ల నష్టాల్లో ఉన్న ఈ డైరీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తాము అధికారంలోకి వచ్చాక ఆదుకున్నామని చెప్పారు.

తెలంగాణలోని ఏదో ఒక మారుమూల గ్రామానికి నీళ్లు రాకుంటే భగీరథ పథకం దండగ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సభలో హుందాగా మాట్లాడాలని, ప్రతిపక్షాలు హుందాగా మాట్లాడితే తమ నుంచి వచ్చే సమాధానం అలాగే ఉంటుందని, రాజకీయంగా మాట్లాడితే అదే విధంగా జవాబిస్తామని అన్నారు. ‘మంచిని మంచి’ అనే మెచ్చుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శలు గుప్పించారు.

Related posts