telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లాక్ డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ సమీక్ష

KCR cm telangana

కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలనికేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిపై సమీక్షించిన కేసీఆర్, ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేపు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పర్యటించనున్నారు.

Related posts