సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినేట్ కీలక సమావేశం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితి, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన సడలింపులను తెలంగాణలో అమలు చేసే విషయంపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మద్యం దుకాణాలకు అనుమతులపై కీలక నిర్ణయం తీసుకుని ప్రకటించనున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు, విద్యార్థుల పరీక్షల నిర్వహణ, వైద్యారోగ్య శాఖ ఇచ్చిన నివేదికపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.