telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ధాన్యం కొనుగోలు కేంద్రాల గుడువు పొడిగింపు!

KCR cm telangana

తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు ఈరోజు ఆదేశాలను జారీ చేశారు. వాస్తవానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రేపటి వరకే కొనసాగాల్సి ఉంది. లాక్ డౌన్ కొనసాగుతుండటం, వారం రోజులుగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం సేకరణ కేంద్రాలను మరి కొన్ని రోజుల పాటు కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

వర్షాలు రాకముందే రైతులు తమ ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్ముకోవాలని ఈ సందర్భంగా రైతులను కేసీఆర్ కోరారు. తెలంగాణలో ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది పంట పండింది. పంటను అమ్ముకోవడం గురించి రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని ఇంతకు ముందే సీఎం ప్రకటించారు.

Related posts