telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఢిల్లీకి కేసీఆర్.. మోదీతో సమావేశం!

KCR cm telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి బయల్దేరుతున్నారు. రేపు ప్రధాని మోదీతో ఆయన సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ సమావేశాల సందర్భంగా పలు అంశాలు చర్చించే అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సెక్రటేరియట్ కు రక్షణ భూముల కేటాయింపు, విభజన చట్టం కింద రాష్ట్రానికి రావాల్సిన వాటితో పాటు వివిధ కీలక అంశాలపై ముఖ్యమంత్రి భేటీలో చర్చించనున్నారు.

Related posts