telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సుదర్శన్ రావు మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి

Kcr telangana cm

టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్ధాపక సభ్యుడు ఎం.సుదర్శన్‌రావు (62) ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇటీవలే సుదర్శన్ రావు కరోనా బారినపడ్డారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగానే పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

పార్టీ ఆరంభం నుంచి ఉన్న తన సహచరుడు మృతి పట్ల ఆయన చలించిపోయారు. సుదర్శన్ రావు చిన్నవయసులోనే మృతి చెందడం దురదృష్టకరమని కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ తొలినాళ్లలో సుదర్శన్ రావు అద్భుతంగా పనిచేశాడని తెలిపారు. ఈ సందర్భంగా సుదర్శన్ రావు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ బలోపేతానికి సుదర్శన్ రావు ఎంతో కృషి చేశారు. 2009 ఎన్నికల్లో ఆయన కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చేతిలో ఓడిపోయారు. 

Related posts