టీఆరెస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మరో యాగానికి శ్రీకారం చుట్టారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఎర్రవల్లి తన వ్యవసాయ క్షేత్రంలో రెండు యాగాలను నిర్వహించిన కేసీఆర్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ సమయంలో మరో యాగం చేయనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్లో కేసీఆర్ ఈ నెల 21 నుంచి 25 వరకు మహా రుద్ర సహిత సహస్ర చండీ యాగం చెయ్యబోతున్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో యాగానికి ముమ్మర ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ఇప్పటికే యాగ ఏర్పాట్లను కూడా పరిశీలించిన ఆయన అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు 21లోపు పూర్తి కావాలంటే వేగం పెంచమని నిర్వాహకులను ఆదేశించారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఈ భక్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించనుండగా ఎన్నికల ఫలితాల అనంతరం విశాఖలో కేసీఆర్ ను కలిసిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సలహాలు, సూచనల మేరకే ఈ యాగాన్ని తలపెడుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ అంటే అడవాళ్ల ప్రదేశ్ గా మారాలి: రోజా