అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ఈబీసీ రిజర్వేషన్ల బిల్లులో సవరణలు కోరాలని టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ పది శాతం రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణ కేసీఆర్ స్పందించారు.
తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలలో వెనుకబడిన వారికి 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఇప్పటికే ప్రభుత్వం పంపిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాలను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. ఇప్పుడు కేంద్రం రిజర్వేషన్ల పెంపును చేపట్టినందున రాష్ట్ర తీర్మానాలను కూడా ఈ బిల్లులో చేర్చాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. బిల్లులో సవరణలు చేసి, తెలంగాణ డిమాండ్లు నేరవేర్చాలని కేంద్రాన్ని కోరాలని ఎంపీలను ఆదేశించారు.
t