తెలంగాణ సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలతో హైదరాబాదు ప్రగతి భవన్ లో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో రెవెన్యూ సిబ్బందికి ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వీఆర్వోలకు ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇస్తామని తెలిపారు.
గతంలో గ్రామాలు, మండల స్థాయిలో బాగా పనిచేసే అధికారులను ప్రజలు దేవుళ్లుగా భావించేవారని, మళ్లీ అలాంటి సంస్కృతిని వికసింపచేయాలని పిలుపునిచ్చారు. రైతు సంక్షేమమే ప్రధానంగా తీసుకువచ్చిన రెవెన్యూ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు నిజాయతీగా పనిచేయాలని ఉద్బోధించారు. ఇకపై తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని పేర్కొన్నారు.
సీఎం జగన్ హామీలు చేతల్లో చూపించాలి: కన్నా