telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అందుకే ముదిరాజ్ లంటే కేసీఆర్ కు అభిమానం: మంత్రి ఈటల

Etala Rajender

తెలంగాణలో ముదిరాజ్ కులస్థుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మం జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్స్ లోని ఓ మామిడి తోటలో ముదిరాజ్ ల వన భోజనాల కారియక్రమానికి మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ మాతృమూర్తికి 12 మంది సంతానం. ఆమె వద్ద సరిపడా పాలుండేవి కాదని తెలిపారు.

కేసీఆర్ ఫ్యామిలీతో ఆప్యాయంగా ఉండే ముదిరాజ్ ల కుటుంబానికి చెందిన ఓ తల్లి పాలు తాగి కేసీఆర్ పెరిగారని తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ కు ముదిరాజ్ కులస్థులంటే ఎంతో అభిమానమని ఈటల వ్యాఖ్యానించారు. అందుకే కేసీఆర్ ముదిరాజ్ కులస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. నాటి అనుబంధంతోనే వారి సంక్షేమంపై అత్యంత శ్రద్ధ చూపుతున్నారు” అన్నారు. ముదిరాజ్ ల బాధలన్నీ తెలుసుకుని, వారి ఆర్థికాభివృద్ధికి తమ ప్రభుత్వం బాటలు వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts