telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే పోరాటం తప్పదు : సీఎల్పీ నేత భట్టి

Batti vikramarka

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నిన్న సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ కార్మికులకు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోసీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఆర్టీసీనీ ప్రైవేటు పరం చేస్తే పోరాటం చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తుల పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రూట్లను ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు.

కేసీఆర్ ఎంతో యుక్తిగా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తామని కేసీఆర్ చెప్పలేదా? అని భట్టి నిలదీశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. లాభాలతో నడుస్తున్న ఆర్టీసీని నష్టాల్లో ముంచేశారని విమర్శించారు. ఈ రోజు రాష్ట్రంలో చోటుచేసుకున్న కార్మికుల ఆత్మ హత్యలకు కేసీఆరే బాధ్యుడని భట్టి దుయ్యబట్టారు.

Related posts