telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఉపాధి కూలీల మృతిపై కేసీఆర్‌ దిగ్భ్రాంతి

upadhi-hami-workers
ఉమ్మడి మహబూబ్‌నగర్ పాలమూరు జిల్లాలో 10 మంది ఉపాధి హామీ కార్మికులు మట్టి పెళ్ళలు పడి మృతి చెందారు. దుర్ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాలోని మరికల్‌ మండలం తీలేరు గ్రామ సమీపంలోని యెడ్మార్‌ తిప్పగుట్ట వద్ద మట్టి పెల్లలు విరిగి పడడంతో  కూలీలు ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఘటనాస్థలికి పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన మరికల్ మండలం తీలేరులో జరిగింది. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.  
 

Related posts