వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి తెరాస అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ తాను చేపడుతున్న యాగానికి ఆహ్వానించారు. దీనికి ముందు రాబోయే నెలలో జగన్ గృహప్రవేశానికి కేసీఆర్ ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ రెండు విషయాలను బట్టి, వైసీపీ కూడా కేసీఆర్ ఫ్రంట్ కు సై అన్నట్టే అనిపిస్తుంది. ఆ అనూహ్య పరిణామాలు జగన్ కు మేలుచేస్తాయా, కీడు చేస్తాయా… అనేది కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చలలో ప్రముఖంగా ఉన్నాయి.
ఈ నెల 21 నుంచి 25 వరకు తన ఫాం హౌస్లో కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన యాగానికి జగన్ హాజరు కానున్నట్టు సమాచారం. గతంలో కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు. అయితే, ఈసారి చంద్రబాబుకు ఆహ్వానం అందలేదని సమాచారం. తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు-కేసీఆర్ మధ్య దూరం పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మరోవైపు, ఈ యాగానికి హాజరుకావడం ద్వారా కేసీఆర్తో తన మైత్రీ బంధాన్ని మరింత పెంచుకోవాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ కాపులనువాడుకుని వదిలేసింది: మంత్రి బొత్స