కేటీఆర్ను సీఎం చేస్తారనే వార్తలు ఈ మధ్య కాలంలో బాగానే పెరిగిపోయాయి. సొంత పార్టీ నేతలే.. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అంటున్నారు. నిన్న కూడా మంత్రి తలసాని నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కేటీఆర్ను సీఎం చేయాలని తమ డిమాండ్ను తెలిపారు. అయితే.. కేటీఆర్ సీఎం కాబోతున్నాడంటూ… వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాని గురించి తనకు తెలియదని.. ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, తాతయ్య రాజకీయాల గురించి అసలు చర్చించరని క్లారిటీ ఇచ్చాడు హిమాన్షు. బుధవారం ఇన్స్టాగ్రామ్లో “ఆస్క్ మీ వాటేవర్ యూ ఫీల్ లైక్” అనే ట్యాగ్ లైన్తో నెటిజెన్లతో ముచ్చిటించారు హిమాన్షు. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు. కేటీఆర్, కేసీఆర్ లాగే రాజకీయాల్లోకి వస్తారా.. అని ఒకరు అడగ్గా.. తనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని చెప్పుకొచ్చాడు హిమాన్షు. అలాగే… కేటీఆర్ పట్టాభిషేకంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, తాతయ్య రాజకీయాల గురించి అసలు చర్చించరని కుండ బద్దలు కొట్టేశాడు హిమాన్షు.
previous post