telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గండ్ర వ్యాఖ్యల పై మండిపడ్డ కేసీఆర్

KCR Fire to Congress MLA Gandra

గవర్నర్ తన ప్రసంగంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోను చదివారని విమర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మడిపడ్డారు. ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న మేనిఫెస్టోనే గవర్నర్ ప్రసంగిస్తారని ఆయన అన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అక్కడి గవర్నర్లు కాంగ్రెస్ మేనిఫెస్టోనే చదువుతారని, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఇక్కడ గవర్నర్ ప్రసంగం టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోనే చదువుతారని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్‌ ఆలోచన మారడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలుచేసి తీరుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. గత టర్మ్‌లో మ్యానిఫెస్టోలో లేకపోయినా 72 పథకాలు అమలుచేశామన్నారు.గతంలో మాదిరిగానే రుణమాఫీ చేస్తామని, ఈసారి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Related posts