telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీని నిర్వీర్యం చేసిన కేసీఆర్.. ఉద్యోగులంతా జాగ్రత్తగా ఉండాలి: విజయశాంతి

Congress vijayashanti comments Modi Kcr

ఆర్టీసీని నిర్వీర్యం చేసిన కేసీఆర్.. ఉద్యోగులంతా జాగ్రత్తగా ఉండాలి: విజయశాంతతెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి ఫేస్ బుక్ లో విమర్శలు గుప్పించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసినట్టుగానే, మిగతా వ్యవస్థలను నాశనం చేసేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోందని, ఉద్యోగులంతా జాగ్రత్తగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టి, టీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.

“ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకుని… మిగిలిన శాఖలకు చెందిన ఉద్యోగులపై కూడా పంజా విసరడానికి కెసిఆర్ ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వాదన వినిపిస్తోంది. శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేసిన సీఎం దొరగారు… ఆర్టీసీ సమ్మె ను ఆసరాగా చేసుకుని తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు అన్నిటినీ కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చ పోతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం… దాని ద్వారా మొత్తం వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని అనుకోవడం కేసీఆర్ గారి వ్యూహంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

Related posts