telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉద్యోగులు ఇళ్లలోనే ఉండొచ్చు: సీఎం కేసీఆర్

kcr stand on earlier warning to rtc employees

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈ నెల 31 వరకు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరంలేదని తెలిపారు. కొన్ని కీలక సర్వీసులకు సంబంధించిన ఉద్యోగులు తప్ప మిగిలిన ఉద్యోగులు ఇళ్లలోనే ఉండొచ్చని తెలిపారు.

వైద్య విభాగం, విద్యుత్ శాఖ తదితర అత్యవసర సర్వీసులు ఉద్యోగులు వంద శాతం కార్యాలయాలకు హాజరవ్వాలని, 20 శాతం రొటేషన్ పద్ధతిలో కార్యాలయాలకు హాజరవ్వాల్సి ఉంటుందని వివరించారు విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏ కార్యక్రమం జరగదని, పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా నిలిపివేస్తున్నామని సీఎం చెప్పారు. మార్చి 31వ తేదీ తర్వాత సమీక్ష నిర్వహించి తదుపరి పరిణామాలపై అప్పుడు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Related posts