telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

KCR cm telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు శాసనసభలో బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతూ కేంద్రం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో స్థూల ఆర్థిక విధానాలను కేంద్ర ప్రభుత్వమే శాసిస్తుందని దుయ్యబట్టారు. గత ఏడాదిన్నరగా దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడిందనని అన్నారు. జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని చెప్పారు. వాహనాలు కొనేవారు లేక ఆటోమొబైల్ రంగం కుదేలైపోయిందని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన విధానాలను రాష్ట్రాలు అనుసరించడం మినహా మరో గత్యంతరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

దిగజారిన ఆర్థిక పరిస్థితికి ఇది నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా ఆర్థికశాస్త్ర మేధావుల సలహాలతో బడ్జెట్ ను రూపొందించాల్సి వచ్చిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో అందరూ అర్థం చేసుకోవాలని కోరారు.దేశ ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్న తరుణంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి రావడం పట్ల తాను చింతిస్తున్నానని తెలిపారు.

Related posts