బయోటెక్ రంగ ప్రముఖుడు డాక్టర్ బీఎస్ బజాజ్ (93) మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. బజాజ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ స్పందిస్త, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.హైదరాబాద్ లో బయోటెక్నాలజీ రంగం అభివృద్ధి చెందడానికి బీఎస్ బజాజ్ ఎంతో కృషి చేశారని కీర్తించారు.
ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ సమాఖ్యకు ఆయన వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించారని అన్నారు. 2019లో జరిగిన బయో ఆసియా సదస్సులో ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు కూడా ఇచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు.
వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విచారణ