telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీఎన్‌ యుగంధర్‌ మృతికి .. ప్రముఖుల సంతాపం..

kcr and chandrababu condolence to retired ias yugandhar

తెలంగాణ సీఎం కేసీఆర్‌, తెదేపా అధినేత చంద్రబాబు బీఎన్‌ యుగంధర్‌ మృతికి సంతాపం తెలిపారు. నిజాయతీ, చిత్తశుద్ధి కలిగిన అధికారిగా యుగంధర్‌ చేసిన సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు. ఆయన కుమారుడు, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గ్రామీణాభివృద్ధి శాఖలో కీలక సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి యుగంధర్‌ అని చంద్రబాబు అన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. వాటర్‌షెడ్ల అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, భాజపా ఎంపీ సుజనాచౌదరి యుగంధర్‌ మృతికి సంతాపం తెలిపారు.

Related posts