బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ గా రాణించడమే కాకుండా… ఇప్పుడు సౌందర్య ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టారు. ‘కే బై కత్రినా` పేరుతో కత్రినా ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. తాజాగా కత్రినా తన బ్యూటీ ప్రొడక్ట్స్ కో్సం నయనతారతో కలిసి ఓ వీడియో రూపొందించారు. దీనికి సంబంధించిన క్లిప్ను కత్రినా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. “సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నా బ్రాండ్ ప్రమోషన్స్లో భాగంగా ముంబై వచ్చిన దక్షిణాది అందమైన తార నయనతారకు థ్యాంక్స్” అని కూడా మెసేజ్ చేశారు. ప్రస్తుతం ‘సూర్యవంశీ’ చిత్రంలో కత్రినా నటిస్తుంటే, నయనతార హీరోయిన్గా నటించిన “విజిల్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
previous post