తెలుగు సినిమా పరిశ్రమలోకి మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇటీవలే మాల్దీవుల్లో బీచ్లో ఫొటోషూట్ స్టిల్ ను షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అయింది. తాజాగా బాలీవుడ్ సుందరి కత్రినా సెట్స్ కు వెళ్లేముందు కోవిడ్ 19 టెస్ట్ చేయించుకుంది. ఆరోగ్యభద్రతను దృష్టిలో పెట్టుకుని కత్రినా కోవిడ్ టెస్ట్ చేయించుకున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. హ్యాపీగా టెస్ట్ చేయించుకోండి అన్నట్టుగా సూచనలు చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అయింది. కత్రినా, కరోనా వైరస్ ను చిన్న స్మైల్ తోను ఎదురించగలదని, టెస్ట్ చేయించుకోవడం ద్వారా అందరికి ఆదర్శంగా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కత్రినా కైఫ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి సూర్యవంశీ చిత్రంలో నటిస్తోంది. అయితే ప్రస్తుతం కత్రినాకైఫ్కరోనా పరీక్షా చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు మన దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉంది అందరికి తెలుసు. రోజుకు 40 వేలకు పైగా కేసులు వస్తున్నాయి.
previous post
next post
ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ యూటర్న్: షబ్బీర్ అలీ