telugu navyamedia
రాజకీయ

కశ్మీర్‌ హత్యలకు నిరసనగా.. యువ ఐఏఎస్‌ రాజీనామా

జమ్మూ, కశ్మీర్‌కు చెందిన యువ ఐఏఎస్‌ అధికారి షా ఫజల్‌ బుధవారం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2009లో జరిగిన సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఆయన మొదటి ర్యాంకు సాధించారు. ఫస్ట్‌ ర్యాంకు సాధించిన మొదటి కశ్మీరీగా ఆయన చరిత్ర సృష్టించారు. ఐఏఎస్‌ అధికారి అయినప్పటి నుంచి ప్రజల సమస్యలపై నిత్యం స్పందించే వారు. 
కశ్మీర్‌లో జరుగుతున్న నిరంతర హత్యలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హత్యలను అరికట్టేం దుకు కేంద్రం చర్యలు తీసుకో వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామాకు గల కారణాలను తన ఫేస్‌బుక్‌ పేజీలో రాశారు. కొన్ని హిందుత్వ శక్తుల చేతుల్లో 20 కోట్ల భారతీయ ముస్లింలు వివక్షకు గురవుతు న్నారని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Related posts