telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

కశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. తెలంగాణ జవాను వీరమరణం!

army javan telangana

శ్రీనగర్ సమీపంలో నిన్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరో తెలంగాణ జవాను వీరమరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా నాగెపల్లి గ్రామానికి చెందిన శాలిగాం శ్రీనివాస్ కాల్పుల్లో చనిపోయారు. అతని వయసు 28 సంవత్సరాలు. ఏడు సంవత్సరాల క్రితం సైన్యంలో చేరిన,శ్రీనివాస్ కు రెండు సంవత్సరాల క్రితమే వివాహమైంది.

వివిధ సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహించి, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ పరిధిలోని సరిహద్దుల్లో విధుల్లో ఉన్నారు. నిన్న తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేయగా తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. కరోనా మహమ్మారి విజృంభించడానికి ముందు స్వగ్రామానికి వచ్చిన శ్రీనివాస్, లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తరువాత జూన్ 4న విధులకు వెళ్లి, 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి, తనలో వైరస్ లేదని నిర్ధారించుకుని విధుల్లో చేరి మృతి చెందాడు.

శ్రీనివాస్ మృతి విషయం తెలియడంతో నాగెపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్రీనివాస్ కుటుంబాన్ని పలువురు పరామర్శిస్తున్నారు. అతని మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Related posts