యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజై అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ను రాబట్టుకుంది. పాటలు, హీరోయిన్ లేకుండా ఎంతో ఎమోషనల్గా చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం 50 రోజుల జర్నీ పూర్తి చేసుకుంది. ఎంతో ఎమోషనల్గా సాగిన ఈ మూవీ ఇప్పటికీ మంచి ఆదరణ పొందుతూనే ఉంది. కార్తీ ప్రస్తుతం దొంగ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి తన వదిన జ్యోతికతో కలిసి నటిస్తున్నారు. సత్యరాజ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. పాపనాశం తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆన్సన్ పాల్ కీలక పాత్రలో కనిపించనున్నారట. గోవింద్ వసంత్ చిత్రానికి సంగీతం అందించనుండగా, రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రెమో ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు కార్తీ. రష్మికా మండన్నా కథానాయికగా నటించనుంది. ఇదే కాక పాపనాశం తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలోను ఓ సినిమా చేస్తున్నాడు కార్తీ.
previous post