telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

50 రోజులు పూర్తి చేసుకున్న కార్తీ “ఖైదీ”

Khaidi

యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజై అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. పాట‌లు, హీరోయిన్ లేకుండా ఎంతో ఎమోష‌న‌ల్‌గా చిత్రాన్ని తెర‌కెక్కించారు. తాజాగా ఈ చిత్రం 50 రోజుల జ‌ర్నీ పూర్తి చేసుకుంది. ఎంతో ఎమోష‌న‌ల్‌గా సాగిన ఈ మూవీ ఇప్ప‌టికీ మంచి ఆద‌ర‌ణ పొందుతూనే ఉంది. కార్తీ ప్ర‌స్తుతం దొంగ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలిసారి త‌న వ‌దిన జ్యోతిక‌తో క‌లిసి న‌టిస్తున్నారు. స‌త్య‌రాజ్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. పాప‌నాశం తెర‌కెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఆన్స‌న్ పాల్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. గోవింద్ వ‌సంత్ చిత్రానికి సంగీతం అందించ‌నుండ‌గా, రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. అతి త్వ‌ర‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌రోవైపు రెమో ఫేమ్‌ భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు కార్తీ. రష్మికా మండన్నా కథానాయికగా నటించనుంది. ఇదే కాక పాప‌నాశం తెర‌కెక్కించిన జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా చేస్తున్నాడు కార్తీ.

Related posts