కరోనా వైరస్ నివారణ కోసం కాజీపేట రైల్వే స్టేషన్లో 11 బోగీలతో ప్రత్యేక రైలును సిద్ధంగా ఉంచినట్లు రైల్వే హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిరంజన్ రావు తెలిపారు. కాజీపేటలోని రైల్వే హాస్పిటల్లో కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
కాజీపేట రైల్వే స్టేషన్, డీజిల్ షెడ్ పరిధిలో రెండు క్వారెంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. రైల్వే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు కోవిడ్-19 నివారణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైల్వే ఉద్యోగులకు ఫిజికల్ డిస్టెన్స్ ద్వారా చికిత్సలు అందిస్తున్నామని డాక్టర్ నిరంజన్రావు తెలిపారు.