ఊహించినట్టుగానే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కార్ విజయం సాధించగానే సభ ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ వెంటనే స్పీకర్ తన రాజీనామా లేఖను ఆయన చదివారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, స్పీకర్ గా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ – జేడీఎస్ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాను సభలో పక్షపాతం లేకుండా వ్యవహరించానని పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా నిబంధనలకు అనుగుణంగానే తీసుకున్నానని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. యడ్డీ ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగించాలని కోరారు.