telugu navyamedia
రాజకీయ

కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ రాజీనామా

karnataka speaker disqualified two rebels

ఊహించినట్టుగానే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్  రమేశ్  కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కార్ విజయం సాధించగానే  సభ ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది.  ఆ వెంటనే స్పీకర్ తన రాజీనామా లేఖను ఆయన చదివారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, స్పీకర్ గా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ – జేడీఎస్ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 తాను సభలో పక్షపాతం లేకుండా వ్యవహరించానని పేర్కొన్నారు.  ఏ నిర్ణయం తీసుకున్నా నిబంధనలకు అనుగుణంగానే తీసుకున్నానని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. యడ్డీ ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగించాలని కోరారు.
 

Related posts