రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని కర్ణాటక మంత్రి మధుస్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తుమూకూరు కోవిడ్ ఆసుపత్రిలో చేరిన ఎనిమిది మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. వైరస్ను కట్టడి చేయడం అధికారులకు కష్టమవుతోందని తెలిపారు. పరిస్థితులు ఇక తమ చేతుల్లో లేవని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం యడియూరప్ప స్పందించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్, వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ కూడా మంత్రి మధుస్వామి వ్యాఖ్యలను ఖండించడం గమనార్హం.
మాజీ సీఎంలను గృహనిర్బంధం చేయాల్సిన అవసరం ఏంటి? : గులాంనబీ ఆజాద్