telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కర్ణాటకలో కరోనా ఉగ్రరూపం.. బెంగళూరులో మరోసారి లాక్‌డౌన్!

Red zone corona

కర్ణాటకలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి సాయంత్రం నుంచి ఈనెల 22 వరకు రాజధాని బెంగళూరుతోపాటు పరిసర ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రకటించింది.

రాష్ట్రంలో అత్యవసర సేవలు, కిరాణా దుకాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. నిన్న ఒక్క రోజే 2,738 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం బాధితుల సంఖ్య 41,581కి పెరిగింది. అలాగే ఇప్పటి వరకు 757 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 25 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తమిళనాడులోనూ కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న 4,328 కేసులు నమోదు కాగా, 66 మంది ప్రాణాలు కోల్పోయారు.

Related posts