కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు కూటమికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తాజాగా కర్ణాటక మంత్రి నగేశ్ తన మంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ కు వెళ్లిన నగేశ్, తన రాజీనామా లేఖను గవర్నర్ వజూభాయ్ వాలాకు అందజేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుమారస్వామి ప్రభుత్వానికి నా మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు.
ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ బీజేపీని ఆహ్వానిస్తే నేను ఆ పార్టీకి మద్దతు ఇస్తానాని తెలిపారు. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామాలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తమ మంత్రి పదవులను తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆత్మలు ఘోషిస్తున్నాయి.. కేసీఆర్ కు ఉసురు తగులుతుంది