మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామ మండిపడ్డారు. హిందూ పార్టీ అని చెప్పుకునే బీజేపీ, చివరకు హిందూ దేవాలయంపై కూడా దాడులు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా దేవాలయంలో సోదాలు చేసి, చివరకు ఖాళీ చేతులతో అధికారులు వెనుదిరిగారని చెప్పారు.
ఈ అపవిత్రమైన చర్యతో బీజేపీని దేవుడు రూపుమాపుతాడని ఆయన అన్నారు. గతంలో కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఏకంగా దేవాలయాల్లోకి సైతం ప్రవేశిస్తున్నారని కుమారస్వామి విమర్శించారు. ఇలాంటి చర్యలను హిందువులు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. పురాతన ఆలయంలో సోదాలు నిర్వహించిన అధికారులను వెంటనే వీధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.