కర్ణాటకలో కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. మంగళవారం నిర్వహించిన విశ్వాసపరీక్షలో కుమార స్వామి ప్రభుత్వం ఓటమిని చవిచూసింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 103 ను కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ అందుకోలేకపోయింది. బీజేపీకి అనుకూలంగా 105 మంది సభ్యులు నిలిచారు. ఎట్టకేలకు సంకీర్ణ సర్కార్ ని కూలగొట్టిన బీజేపీ ఎమ్మెల్యేలు సంబరాల్లో మునిగిపోయారు.
ఈ సందర్భంగా కర్ణాటక బీజేపీ ఓ ట్వీట్ చేసింది. ఇది కర్ణాటక ప్రజల విజయమని, అపవిత్ర కూటమికి, అవినీతి ప్రభుత్వానికి ముగింపు ఇదని పేర్కొంది. కర్ణాటకు ప్రజలకు సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. అందరం కలిసికట్టుగా కృషి చేసి కర్ణాటకను మళ్లీ అభివృద్ధి బాటపట్టిద్దామని ట్విటర్ లో పేర్కొన్నారు.
బురద చల్లేందుకు కేసీఆర్ సిద్ధం: జేసీ దివాకర్ రెడ్డి