గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర, వారి వారి గొప్పతనాన్ని, సాధించిన విజయాలను వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు నేటితరం ప్రేక్షకులు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే బయోపిక్స్ రూపొందించేందుకు ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి బయోపిక్ అనౌన్స్ చేశారు కోన వెంకట్. ఈ రోజు (జూన్ 1) కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలుపుతూ అఫీషియల్ ప్రకటన చేశారు. ఒలింపిక్స్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కృతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ చిత్రంలో కరణం మల్లీశ్వరి కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది మాత్రం ప్రకటించకపోవడంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. అతిత్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది.
On her birthday today, we proudly announce our next, a biopic on @kmmalleswari, FIRST Indian woman to win a medal at Olympics. A multilingual PAN Indian movie! #HBDKarnamMalleswari
🖋️ by @konavenkat99
🎬 by @sanjanareddyd
💰 by @MVVCinema_ & @KonaFilmCorp.#MVVSatyanarayana pic.twitter.com/W2qsBft9iL— KonaFilmCorporation (@KonaFilmCorp) June 1, 2020