telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

అది ఆటో కాదు ఆర్టీసీ బస్సు.. 24 మంది ప్రయాణీకులు

auto pasangers

ఓ ఆటోలో 24 మంది ప్రయాణీకులు కూర్చుని బయలుదేరారు. ఇది చూసిన పోలీసులే విస్తుపోయారు. ట్రాఫిక్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ పరిమితికిమించి ప్రయాణీకులను ఎక్కించుకుంటున్నారు. అబ్దుల్ అనే ఓ ఆటో డ్రైవర్ తన వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వెళ్తున్నాడు. కారులో కూడా ఆరుగురి కంటే ఎక్కువ పట్టరు.. అలాంటిది ఓ వ్యానులో పట్టినంతమందిని తన ఆటోలో ఒద్దికగా ఎక్కించేసిన ఆ డ్రైవర్ ప్రతిభకు పోలీసులు షాకయ్యారు. ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తారు? డ్రైవర్‌తో కలుపుకుని నలుగురు. కాస్త, పెద్ద ఆటో అయితే ఆరుగురు. కానీ ఈ ఆటోలో మాత్రం ఏకంగా 24 మందిని తరలిస్తుండగా మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు.

డ్రైవర్‌ను చూసి షాకైన పోలీసులకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. చివరికి ఆటోలో ఎంతమందిని ఎక్కించుకోవాలిరా.. అని ప్రశ్నించారు. ఆరుగురు అని డ్రైవర్‌ సమాధానమిచ్చాడు. మరి ఎంతమంది ఉన్నారో చూద్దామని, దిగాలని వారిని కోరగా ఏకంగా 24 మంది లెక్కతేలారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసిన పోలీసులు సీపీ కరీంనగర్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. తాము ఓ ఫంక్షన్‌కు వెళ్తున్నామని, తమను వదిలిపెట్టాలని ఆటోలోని మహిళలు పోలీసులను వేడుకోవడం కనిపించింది. అందరినీ వరుసగా నిల్చోబెట్టిన పోలీసులు వారికి క్లాస్ తీసుకున్నారు. పరిమితికి మించి ప్రయాణించడం వల్ల ప్రమాదాలకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Related posts