telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్, సారాలను విడదీసింది ఆ స్టార్ హీరోయిన్… : కంగనా

Kareena

సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత కంగనా బాలీవుడ్ పెద్దలను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే పేరును ప్రస్తావించకుండా బేబీ పెంగ్విన్‌ అంటూ కంగన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పీఓకే వ్యాఖ్యలతో కంగన- శివసేనల మధ్య తలెత్తిన మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. భారీ భద్రత నడుమ ముంబైలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే బీఎంసీ అధికారులు పాలిలోని ఆమె ఆఫీసులో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూల్చివేత ప్రారంభించారు. దీంతో కంగన కోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. ఆ తర్వాత గవర్నర్ ను కలిసింది కంగనా. ఆమె సోమవారం ముంబైని వీడి స్వస్థలం మనాలికి చేరుకున్నారు. తాజాగా కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో సుశాంత్ సారా అలీఖాన్ విడిపోవడానికి స్టార్ హీరోయిన్ కరీనా కారణమని చెప్పుకొచ్చింది. తన మొదటి హీరో (సుశాంత్) తో డేటింగ్ చేయవద్దని సారాను ఆమె స్టెప్ మామ్ కరీనా కోరిందని, కరీనాకు మీడియా సహాయపడిందని కూడా చెప్పుకొచ్చింది కంగనా. “మీడియా, బి-టౌన్ విభాగం సుశాంత్-సారా విడిపోయేలా చేశారు. ఈ ‘సూసైడ్ గ్యాంగ్ ’ నన్ను కూడా లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా.

Related posts