telugu navyamedia
సినిమా వార్తలు

ఆ వార్తలు నిరాధారం : కరీనా కపూర్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తన రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలపై  స్పందించారు. సోమవారం రోజు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి నటి కరీనా కపూర్‌ను కాంగ్రెస్ బరిలోకి దించాలని, భోపాల్‌లో బీజేపీని ఓడించడానికి కరీనా కపూరే సరైన వ్యక్తి అంటూ కార్పొరేటర్ యోగేంద్ర సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాసినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో కూడా ఈ విషయమై చర్చించేందుకు ఆయన రెడీ అవుతున్నట్టు గా వార్తలు హల్చల్ చేశాయి. ఈ విషయం కరీనా దృష్టికి రావడంతో ఆమె తన రాజకీయ రంగప్రవేశంపై స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని, రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసలు తనకు అలాంటి ఉద్దేశమే తేల్చేశారు. తనపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమంటూ కరీనా కపూర్ ఆ వార్తలను కొట్టి పారేశారు.

Related posts