కరోనా భయాన్ని కొందరు హ్యాకర్లు సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాకు మెడిసిన్ ఉందంటూ ఆన్లైన్లో ప్రకటనలు గుప్పిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కరోనా వైరస్ సోకకుండా మందులు ఉన్నాయంటూ ప్రముఖ మందుల కంపెనీల పేర్లతో ఈ-మెయిల్స్, మెసేజ్లు పంపిస్తున్నారు.
ఆన్లైన్ ప్రకటనలను ఏ మాత్రం నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు పంపించే మెయిల్లో ఫైల్ అటాచ్మెంట్, మెసేజ్లో ఉండే నీలి రంగు లింక్ క్లిక్ చేస్తే ఇబ్బందులు తప్పవని, బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేసి డబ్బులు స్వాహా చేస్తారని హెచ్చరిస్తున్నారు.