telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చీరాలలో కరణం బలరాం రాజకీయం

Karanam Balaram,Chirala

అమరావతి: చీరాలలో రాజకీయం మారుతున్న దృష్ట్యా పార్టీ సీనియర్ నేత కరణం బలరాంను చీరాల వెళ్లాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రేపో మాపో టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారన్న వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో ఎమ్మెల్సీ కరణం బలరాంను చీరాలకు వెళ్లి పార్టీ పరిస్థితులను చక్కదిద్దాలని అధిష్టానం ఆదేశించింది. పోతుల సునీతను తీసుకెళ్లి చీరాలలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. కాగా… మరికొద్దిసేపట్లో కరణం బలరాం చీరాలకు బయలుదేరనున్నారని సమాచారం.

Related posts