telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కాపు సామాజిక వర్గం టీడీపీకి దూరమైంది: జ్యోతుల నెహ్రూ

jyothula nehru

టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరనున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ సమయంలో టీడీపీ కాపునేతలు కాకినాడలో రహస్యంగా సమావేశం నిర్వహించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాపుల సమావేశం జరగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ స్పందించారు.ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించేందుకే సమావేశం జరిగిందని తెలిపారు.

కాపు సామాజిక వర్గం టీడీపీకి దూరం కావడం వల్లే పరాజయం పాలయ్యామని చెప్పారు. కాపులకు, టీడీపీకి మధ్య అంతరానికి గల కారణాలు, నష్టనివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించామని నెహ్రూ వివరించారు. అంతేతప్ప, తామంతా టీడీపీని వీడుతున్నట్టు వచ్చిన వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. కాపులకు తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్లాల్సిన అవసరంలేదని అన్నారు. తాము మాత్రం టీడీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.

Related posts