కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ముంబై నుంచి కన్యాకుమారికి వెళ్తున్న ట్రైన్లో భారీ చోరీకి పాల్పడ్డారు. రైలు ఎర్రగుంట్ల నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రయాణికురాలను బెదిరించి విలువైన నగలను దొంగలించారు. రైలు కదులుతుండగానే ప్రయాణీకుల సూట్ కేసు లతో పాటు బ్యాగులను తనిఖీ చేసి 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా ఒక ముబైల్ ఫోన్ కూడా అపహరించారు. ఈ మేరకు బాధితురాలు కడప రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.