ఏపీ సీఎం జగన్కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గత ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్నఅక్రమాలపై ఏడు లేఖలు రాశారు. పోలవరం ముంపు వల్ల నష్టపోతున్న గిరిజనులను అన్ని విధాలా ఆదుకోవాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూములపై విచారణ జరిపించాలని కోరారు.
అంతేకాకుండా ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయాలని సూచించారు. ప్రభుత్వ దేవాలయాల ఆస్తులు పరిరక్షించాలని విఙ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. అదే విధంగా విజయవాడలో కూల్చేసిన 50 ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలని లేఖల్లో విజ్ఞప్తి చేశారు.
ప్రశ్నిస్తున్నందునే నన్ను సస్పెండ్ చేశారు: అచ్చెన్నాయుడు