పరిపాలన వికేంద్రీకరణ అంటూ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర భవిష్యత్తును అయోమయంలోకి నెట్టేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. తుగ్లక్ పాలనలో రాష్ట్ర పరిస్థితి తలకిందులైన తాబేలులా తయారైందని సీఎం జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కాని, పరిపాలన వికేంద్రీకరణ కాదని అన్నారు. అమరావతిలో ఇప్పుడున్న నిర్మాణాలకు, వాటాదారులకు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు తలకిందులైన తాబేలు ఫొటోను జత చేశారు.